Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాపట్ల జిల్లాలో చేపట్టనున్న పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
‘గ్రేట్ గ్రీన్ వాల్’ కార్యక్రమం ప్రారంభోత్సవం, జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు బాపట్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
కొత్త పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొనాల్సి ఉంది.

