Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్

Pattabhi: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్‌పై వైఎస్సార్‌సీపీ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పట్టాభి రామ్ కొమ్మరెడ్డి డిమాండ్ చేశారు. జోగి రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడిన పట్టాభి,జోగి రమేశ్ అరెస్ట్ పక్కా ఆధారాలతోనే జరిగిందని,దీనిపై రాజకీయ కక్ష చూపించడంలేదని,అద్దేపల్లి బ్రదర్స్‌తో జరిగిన ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ స్పష్టమైన సాక్ష్యాలేనని తెలిపారు.

టీడీపీ, తమ నేతపై ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేసిందని గుర్తు చేస్తూ,“వైఎస్సార్‌సీపీ నేతలు నకిలీ మద్యం దందా ద్వారా కోట్ల కోట్లు సంపాదించారు. ఈ వ్యవహారం జగన్ కుటుంబానికి కమీషన్ల కోసం నడిచింది”అని ఆయన ఆరోపించారు.

నైతిక విలువలు ఉంటే వెంటనే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *