pakistan: ‘ఆపరేషన్ సిందూర్’ కుప్పకూలిన స్టాక్ మార్కట్

pakistan: భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడులు పాకిస్థాన్‌ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో, కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కరాచీ-100 సూచీ ఆరంభంలోనే 6% నష్టపోయింది. మార్కెట్‌ చివరికి 3,470 పాయింట్ల నష్టంతో (3.09%) 1,10,063 వద్ద ముగిసింది. పెహల్‌గామ్‌ ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీసుకుంటుందన్న అంచనాల మధ్యే ఇప్పటికే పాక్ మార్కెట్ ఒత్తిడిలో ఉండగా, తాజా దాడులు మరింత ప్రభావం చూపించాయి.

అంతకుమాత్రమే భారత మార్కెట్లపై ప్రభావం చూపలేకపోయాయి. ఉగ్ర స్థావరాలకే దాడులు పరిమితమవుతాయని, పాక్ ఆర్థికంగా ప్రతిస్పందించే స్థితిలో లేదన్న విశ్వాసం మార్కెట్లకు సానుకూలతనిచ్చింది. విదేశీ మదుపు ప్రవాహం, డాలర్ బలహీనత, ముడిచమురు ధరల తగ్గుదల, గ్లోబల్ వృద్ధి మందగతం వంటి అంశాలు కూడా మార్కెట్లకు తోడ్పడ్డాయి.

కొన్ని ఒడిదొడుకుల అనంతరం, సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడి 80,746 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 24,414 వద్ద ముగిశాయి. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 41 పైసలు తగ్గి 84.81గా నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *