manipur

Manipur: చల్లారని మణిపూర్ అల్లర్లు.. అదనపు దళాలను పంపిన కేంద్రం

Manipur: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో మరోసారి పరిస్థితి విషమించేలా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 7 జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. నవంబర్ 16న మొదలైన హింస సోమవారం కూడా కొనసాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మణిపూర్ ప్రభుత్వం ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, తౌబాల్,  చురచంద్‌పూర్ 7 జిల్లాల్లో ఇంటర్నెట్-మొబైల్ సర్వీసులపై నిషేధాన్ని నవంబర్ 20 వరకు పొడిగించింది.

ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో నవంబర్ 17న విధించిన కర్ఫ్యూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించారు. అంతేకాకుండా, మొత్తం 7 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలను నవంబర్ 20 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Manipur: భద్రతా బలగాలు వీధుల్లో పహారా కాస్తున్నాయి. సీఎం బీరెన్ సింగ్ నివాసం, రాజ్‌భవన్‌ వద్ద భద్రతను మరింత పెంచారు. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో వరుసగా రెండవ రోజు మణిపూర్ హింసపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో అదనంగా 50 కంపెనీలను  అంటే 5 వేల మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సైనికులను మణిపూర్‌కు పంపాలని నిర్ణయించారు. నవంబర్ 8, 11 తేదీల్లో జరిగిన ఘటనల దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ అంటే ఎన్‌ఐఏకి అప్పగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *