T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు నేపాల్, ఒమన్ అర్హత

T20 World Cup 2026: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 కోసం ఆసియా ప్రాంతం నుంచి మరో రెండు జట్లు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫైయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపాల్ మరియు ఒమన్ జట్లు మెగా టోర్నీకి బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు జరిగిన ఆసియా క్వాలిఫైయర్స్ టోర్నమెంట్‌లో నేపాల్, ఒమన్ జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఆసియా క్వాలిఫైయర్స్‌లోని ‘సూపర్ సిక్స్’ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: HCA సెలక్షన్‌ కమిటీ సభ్యులపై కేసు నమోదు

ఒమన్ జట్టు కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించింది. నిన్న (బుధవారం) సమోవాతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో నేపాల్, ఒమన్ జట్లు ముందంజలో ఉండటంతో వాటి అర్హత ఖరారైంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, నేపాల్, ఒమన్‌ల అర్హతతో ప్రపంచకప్‌ బెర్త్‌ల సంఖ్య 19కి చేరింది. మరో జట్టు కూడా అర్హత సాధించాల్సి ఉంది. ఆఫ్రికా క్వాలిఫైయర్స్‌ నుంచి నమీబియా, జింబాబ్వే; యూరప్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి ఇటలీ, నెదర్లాండ్స్‌; అమెరికా క్వాలిఫైయర్స్‌ నుంచి కెనడా జట్లు ఇప్పటికే ప్రపంచకప్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక నేరుగా టోర్నీలో ఆడనుండగా, 2024 ప్రపంచకప్‌ ప్రదర్శన ఆధారంగా అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్‌ జట్లు అర్హత సాధించాయి. ఈ క్వాలిఫైయర్స్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న నేపాల్, ఒమన్ జట్లు మెగా టోర్నీలో ఏ మేరకు రాణిస్తాయో వేచి చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *