Viral News: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో, ఫిబ్రవరి 24న భయానక ఘటన చోటుచేసుకుంది. 5 ఏళ్ల బాలుడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, ఒక మహిళ నిర్లక్ష్యంగా కారు నడిపి అతడిని ఢీకొట్టింది. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, గాయపడిన బాలుడికి సహాయం చేయకుండా, ఆమె కారుతో అక్కడి నుంచి పారిపోయింది.
ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని కుడి తొడ ఎముక విరిగిపోయింది, అలాగే శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే, స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
Also Read: Danish Malewar: రంజీ ఫైనల్లో సెంచరీతో అదరగొట్టిన డానిష్ మలేవార్..! కొత్త స్టార్ పుట్టుకొచ్చాడా?
బాలుడి తండ్రి నందగ్రామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మహిళపై సెక్షన్ 281 మరియు 125బి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 26న షేర్ చేసిన ఈ వీడియోను 3.2 లక్షల మంది చూశారు.
Ghaziabad, SG Grand. A visitor woman drove her car over a kid and left. @ghaziabadpolice allegedly refused to file the FIR and asked for CCTV footage. Societies entry register page of that day was also torn. Because of her privileged gender she escaped safely? #naarishakti pic.twitter.com/zNm2FHwqSQ
— Moksh Of Men (@mishrag47) February 26, 2025
ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు, “ఇది చాలా బాధాకరం, బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేయడం ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది” అంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం పోలీసులు మహిళను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.