Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది

అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం త‌మ‌ద‌ని మంత్రి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు త‌మ‌ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంద‌ని చెప్పారు.

మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని, వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం తాజాగా రూ.10 వేలకు పెంచడం జరిగిందని తెలిపారు.

దాంతో రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆటంకం లేకుండా తయారైందని మంత్రి లోకేష్ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *