Najmul Hossain Shanto: బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శాంటో చెప్పాడు. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఇటీవల రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరిగింది, మొదటి మ్యాచ్ డ్రాగా ముగియగా, శ్రీలంక రెండవ మ్యాచ్ను ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో గెలుచుకుంది.
శనివారం బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో ఓడించిన తర్వాత, బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శాంటో తెలిపారు. “ఈ ఫార్మాట్లో నేను కెప్టెన్గా కొనసాగాలనుకోవడం లేదు, అందరికీ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వ్యక్తిగత విషయం కాదు. ఇది పూర్తిగా జట్టు మంచి కోసమే, ఇది జట్టుకు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. క్రికెట్ బోర్డు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లతో కొనసాగాలని భావిస్తే, అది మంచి నిర్ణయం అవుతుంది” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: AUS vs WI: తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
శాంటో రాజీనామా మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ను షాక్ కు గురిచేసింది. సిరీస్లోని మొదటి మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించడం ద్వారా శాంటో చరిత్ర సృష్టించాడు, బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో మొదటి కెప్టెన్గా శాంటో నిలిచాడు. ఇప్పుడు అతని ఆకస్మిక నిర్ణయం బంగ్లాదేశ్ అభిమానులకు, జట్టు యాజమాన్యానికి జీర్ణించుకోవడం కష్టం. అయితే, కెప్టెన్సీ నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని కూడా అతను వివరించాడు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్గా లిట్టన్ దాస్ ఉండగా.. వన్డే కెప్టెన్గా మెహదీ హసన్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి.