NTR: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్పై టాలీవుడ్లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఎన్టీఆర్ స్టార్డమ్తో ఈ చిత్రం తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని, హిట్ టాక్ వస్తే రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ రైట్స్ను కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానిగా నాగవంశీ ఉండటంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే, నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ, “‘వార్ 2’ రైట్స్ కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవం. మా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వస్తాయి” అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నాగవంశీతో పాటు ఏషియన్ సినిమాస్కు చెందిన సునీల్ కూడా ఈ రైట్స్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ‘వార్ 2’ రైట్స్ ఎవరి సొంతమవుతాయన్న ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది.

