Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిమాయత్‌సాగర్ వద్ద యువకుడి దారుణ హత్య

Hyderabad: హైదరాబాద్‌ నగర శివార్లలో ఒక యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్‌ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుడిని కిరాతకంగా చంపి, ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా గుర్తించారు. నిందితులు అమీర్‌ను చంపిన తర్వాత, మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శరీరం పాక్షికంగా కాలి ఉండటాన్ని గమనించిన పోలీసులు, దీని వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అమీర్‌ను ముందే హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి తగులబెట్టారా? లేక ప్రాణాలతో ఉండగానే సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *