Mumbai: బాలీవుడ్ పై ప్రియమణి షాకింగ్ కామెంట్స్

Mumbai: ప్రముఖ నటి ప్రియమణి బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, మనోజ్ బాజ్‌పేయీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురూ తమ తమ శైలిలో సూపర్‌స్టార్లు అని, ఒక్కొక్కరి పనితీరు పూర్తిగా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని ఆమె వెల్లడించారు.

ఐఏఎన్ఎస్‌ (IANS)‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ –“వారందరూ తమ స్థాయికి తామే చేరుకున్నారు. ఒక్కొక్కరి వర్కింగ్‌ స్టైల్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. నా కెరీర్‌ ప్రారంభంలోనే ఇంతటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం నాకు ఎంతో భాగ్యంగా అనిపిస్తోంది. మళ్లీ అవకాశం వస్తే వారందరితో తప్పకుండా మళ్లీ పనిచేయాలని ఉంది,” అని తెలిపారు.

వారు ఈ స్థాయికి చేరుకోవడానికి చూపిన కృషి, అంకితభావం ప్రేరణాత్మకమని ప్రియమణి కొనియాడారు. “వారి విజయాలు యాదృచ్ఛికం కావు… ప్రతి ఒక్కరూ తమ కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నారు. వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను,” అని ఆమె అన్నారు.

ప్రియమణి ఇటీవల అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి లక్ష్మి అనే కీలక పాత్రలో నటించారు. అలాగే అజయ్ దేవగణ్‌తో కలిసి ఆమె నటించిన ‘మైదాన్’ చిత్రం ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక మనోజ్ బాజ్‌పేయీతో కలిసి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ ఆమెకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో ఆమె పోషించిన సుచిత్ర తివారీ పాత్ర విపరీతమైన ఆదరణ పొందింది.

త్వరలో రాబోయే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సీజన్‌లో కూడా ప్రియమణి అదే పాత్రలో ప్రేక్షకులను మరోసారి అలరించనున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *