Mulugu District

Mulugu District: ములగులో ఉద్రిక్తత: గుడిసెల తొలగింపును అడ్డుకున్న గిరిజనులు

Mulugu District: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోహీర్ బీట్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు నిర్మించుకున్న గుడిసెలను తొలగించడానికి వచ్చిన అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు.

అటవీ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకున్నారనే ఆరోపణలతో, అధికారులు జేసీబీలు, డోజర్లతో అక్కడికి చేరుకున్నారు. గుడిసెలను కూల్చివేసే ప్రయత్నం చేయగా, అక్కడున్న గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవనాధారం లాగేసుకుంటున్నారంటూ అధికారుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటింది. ఆవేశంతో ఊగిపోయిన గిరిజనులు తమ చేతుల్లో ఉన్న కర్రలతో అధికారులపై ఎదురుదాడికి దిగారు. గుడిసెల తొలగింపు వాహనాలను తరిమికొట్టారు. గిరిజనుల నుండి ఊహించని ప్రతిఘటన రావడంతో, అటవీశాఖ అధికారులు, పోలీసులు అక్కడి నుండి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

Also Read: Bengaluru: బెంగళూరులో రాపిడో డ్రైవర్‌ దౌర్జన్యం: మహిళా ప్రయాణికురాలిపై దాడి

Mulugu District: దీంతో అధికారులు గుడిసెల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన అటవీ భూముల విషయంలో గిరిజనులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దీర్ఘకాలిక వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తమ హక్కులను కాపాడుకోవడానికి గిరిజనులు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో, స్థానిక అధికార యంత్రాంగం పరిస్థితిని చక్కదిద్దడానికి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  US Elections 2024: అమెరికా ఎన్నికల్లో ఏనుగు-గాడిద.. అసలు కథ ఏమిటంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *