Mohammad Rizwan

Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ వన్డే కెప్టెన్సీపై వేటు?

Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వన్డే జట్టు కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యంపై చర్చించేందుకు సోమవారం (అక్టోబర్ 20) నాడు జాతీయ సెలక్షన్ కమిటీ, సలహా బోర్డు సంయుక్త సమావేశాన్ని లాహోర్‌లో ఏర్పాటు చేయనుంది. పాకిస్థాన్ వైట్-బాల్ ఫార్మాట్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, వన్డే జట్టు అంశాలు, కెప్టెన్సీపై చర్చించడానికి సెలెక్టర్లు, సలహాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీకి లేఖ రాసినట్లు పీసీబీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. వన్డే కెప్టెన్సీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై చర్చించడానికి సోమవారం సమావేశం కావాలని ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ సెలెక్టర్లు మరియు సలహాదారులను కోరారు అని పీసీబీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Ayodhya: అయోధ్యకు 23.82 కోట్లకు పెరిగిన సందర్శకుల సంఖ్య

ఈ సమావేశంలో కోచ్ హెస్సన్ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను కలిగి ఉంది (టెస్టులకు షాన్ మసూద్, వన్డేలకు రిజ్వాన్, టీ20లకు సల్మాన్ అలీ ఆఘా). రిజ్వాన్ సారథ్యంలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌లు గెలిచినప్పటికీ, ఇటీవల న్యూజిలాండ్‌తో, వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌ల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. దీంతో రిజ్వాన్ కెప్టెన్సీ మార్పుపై వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. హెస్సన్ కూడా కెప్టెన్సీ మార్పు కోసం పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రిజ్వాన్ స్థానంలో షాహీన్ షా అఫ్రిది లేదా సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెలక్షన్ కమిటీ, సలహా బోర్డు సోమవారం సమావేశం అనంతరం వన్డే కెప్టెన్సీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *