MLA Raja Singh:

MLA Raja Singh: అఘాపురా గ‌ణేశ్ విగ్ర‌హ రూపుపై రాజాసింగ్ అభ్యంత‌రం

MLA Raja Singh: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా హైద‌రాబాద్ గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అఘాపురాలో ఓ చోట ఏర్పాటు చేసిన వినాయ‌క విగ్ర‌హంపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తంచేశారు. ఆ విగ్ర‌హం సీఎం రేవంత్‌రెడ్డిని పోలి ఉన్న‌ద‌ని తెలిపారు. దానిని చూసేందుకు భ‌క్తులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపుతున్నారు.

MLA Raja Singh: ఈ నేప‌థ్యంలో ఆ విగ్ర‌హంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంత‌రాలు వ్య‌క్తంచేశారు. రేవంత్‌రెడ్డి దేవుడు కాదు క‌దా? అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై గౌర‌వంతో నిర్వాహ‌కులు ఏర్పాటు చేసినా ఆయ‌న త‌మ‌కు దేవుడు కాడ‌ని తేల్చి చెప్పారు. వెంట‌నే ఆ మండ‌పాన్ని తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు.

MLA Raja Singh: ఇలాంటి చ‌ర్య‌లు హిందూ స‌మాజం యొక్క‌ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాయ‌ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఎవ‌రైనా మ‌త విశ్వాసాల‌ను గౌర‌వించాల‌ని హిత‌వు ప‌లికారు. ఎవ‌రు చేసినా తప్పేన‌ని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రావెల్స్ బ‌స్సును ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *