Mirai: ‘హనుమాన్’ బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో తేజ సూపర్ యోధుడిగా కనిపించనున్నారు. ముంబైలోని చారిత్రక గుహల్లో తాజాగా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో తేజతో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొంటున్నారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో ఆగస్టులో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. షెడ్యూల్ ప్రకారం స్పీడ్గా జరుగుతున్న షూటింగ్తో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి!
