Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’ షురూ.. ₹5కే కడుపు నిండా టిఫిన్!

Hyderabad: తెలంగాణలో కొత్తగా వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల కోసం మరో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదే ఇందిరమ్మ క్యాంటీన్లు. ఈ క్యాంటీన్లను హైదరాబాద్ నగరంలో పనికోసం, ఇతర పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం తక్కువ ధరకే అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నగరంలోని బాగ్ లింగంపల్లి, సుందరయ్య పార్క్ దగ్గర మొదటి ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మరియు కవాడిగూడ NTPC దగ్గర కూడా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంకా హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో, అక్కడి ప్రజలు లేదా స్థానిక నాయకులు కోరిన చోట కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

₹5 రూపాయలకే ప్రజలకు మంచి నాణ్యమైన టిఫిన్, భోజనం ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరానికి ఉపాధి కోసం వచ్చిన పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *