chiranjeevi health

చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !

మెగాస్టార్ చిరంజీవి మూడు వారాలుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని తెలుస్తోంది .  గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 22) ఆయన గిన్నిస్ ఈవెంట్ లో పాల్గొన్నారు .  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి చిరంజీవితో సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాతలు ,  దర్శకులు, మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .  అదేవిధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా నిరంతరంగా రక్త దానం చేస్తూ వస్తున్న చిరంజీవి అభిమానులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుకున్నారు .  వీరందరి సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్స్ ,  అమీర్ ఖాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందచేశారు .

అయితే ,  ఈ వేడుకలో చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ యాంకర్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు .  25 రోజులుగా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారని చెప్పారు .  ఈ మధ్యకాలంలో ఆయన బయటకు వెళ్లలేదని . . గిన్నిస్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ తీసుకోవడం కోసం గిన్నిస్ ప్రతినిధుల ఆహ్వానంతో అక్కడకు వచ్చారని ఆమె అన్నారు .  చిరంజీవిని వేదిక మీదకు పిలిచిన సందర్భంలో అమీర్ ఖాన్ ,  సాయి ధరమ్ తేజ్ చిరంజీవిని వేదిక మెట్లు ఎక్కడానికి సహకరించాల్సి వచ్చింది .  ఈ విజువల్స్ చూసిన చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు .  చిరంజీవి త్వరగా కోలుకోవాలని వారంతా కోరుకుంటున్నారు .  చిరంజీవి ఆరోగ్యంపై ఇది ఒకరకంగా అభిమానులకు షాకింగ్ విషయమేనని చెప్పాలి .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Wedding Calls Off: ‘చోలీకే పీఛే క్యాహై’.. వరుడి డ్యాన్స్‌తో రద్దయిన పెళ్లి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *