Bhairavam: టాలీవుడ్లో యువ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘భైరవం’. ‘నాంది’ ఫేమ్ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రాన్ని మెగా అభిమానులు బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం.. గతంలో విజయ్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లపై అనుచిత పోస్ట్లు షేర్ చేశారని అభిమానుల ఆరోపణ. ఈ వివాదంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ స్పందిస్తూ.. ఆ పోస్ట్లు తాను షేర్ చేయలేదని, ఎవరో హ్యాక్ చేసి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. మెగా హీరోలతో కలిసి పనిచేసినప్పుడు వారి నుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందని, తానూ మెగా అభిమానినేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ పోస్ట్తో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘భైరవం’ చుట్టూ ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి!
నమస్కారం
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025