Medaram Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహా జాతర షెడ్యూల్ను అర్చక సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆనవాయితీలో భాగంగా జనవరి 28న చిలకలగుట్ట నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారని, జనవరి 29న సమ్మక్క తల్లి రాకతో జనవరి 30న భక్తులు తలనీలాలు సమర్పించి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
