Manchu lakshmi: ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలే కాకుండా టీవీ షోల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, వివిధ విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకుంటుంది.
తాజాగా, మంచు లక్ష్మి వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త శ్రీనివాస్కు విడాకులు ఇచ్చిందని, దీని వెనుక మోహన్ బాబు హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
తన భర్త శ్రీనివాస్ ఐటీ ప్రొఫెషనల్గా విదేశాల్లో పనిచేస్తున్నారని లక్ష్మి వివరించింది. తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నామని, తమకు నచ్చిన విధంగా బతుకుతున్నామని తెలిపింది. ప్రజలు ఏదో అనుకుంటారని తాము పట్టించుకోమని పేర్కొంది. తన కూతురు కూడా ప్రస్తుతం తన తండ్రి వద్దనే ఉందని వెల్లడిచింది.