Hyderabad: హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వంటలు అతివేగంగా వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది.
Hyderabad: వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ బాంబుల షాపులో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో షాపులోని టపాసులు అతివేగంగా మంటలను వెదజల్లాయి. పటాకుల మోతతో ప్రజలు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న హోటల్కు వ్యాప్తి చెంది ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. సుల్తాన్బజార్ డివిజన్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి,అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైరింజన్లతో గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో దుకాణం ఎదురుగా ఉన్న పది వాహనాలు కాలి బూడిదయ్యాయి.
Hyderabad: బషీర్బాగ్కు చెందిన గుర్విందర్ సింగ్ అనే వ్యాపారి హనుమాన్ టెక్డీలో పారస్ ఫైర్వర్క్స్ దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చారు. అందరూ కొనుగోళ్లలో ఉండగా, దుకాణంలో ఒక్కసారిగా పటాసులు ఒకదాని వెంట ఒకటి పేలాయి. భారీ శబ్ధాలు చేస్తూ క్షణాల్లో టపాసులకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కొనుగోలుదారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
మంటలు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కు వ్యాపించడంతో లోపల సామగ్రి కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుకాణంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పది వరకు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఐదు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.