Mahesh kumar goud: బాంబ్ పేల్చిన పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్.. బీవీలకే ప్రాధాన్యత..

Mahesh kumar goud: తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.

భవిష్యత్‌లో బీసీ సీఎం ఖాయం

బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు. భవిష్యత్‌లో బీసీల్లోంచి సీఎం అవుతారని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ కాలం పూర్తయ్యే వరకు రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగుతారని ఆయన ప్రకటించారు.

కులగణనపై చిత్తశుద్ధి

కులగణన జరిపించడం ద్వారా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందని మరోసారి నిరూపించుకున్నట్టు తెలిపారు. బీజేపీకి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, చట్టసవరణ చేసి తమ వైఖరిని నిరూపించుకోవాలని మహేష్‌కుమార్ గౌడ్ సవాలు విసిరారు.ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: నాగర్ కర్నూల్‌లో పెను ప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *