Mahesh Babu: ఈడి అధికారులకు మహేష్ బాబు రిప్లై

Mahesh Babu: ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులకు లేఖ రాశారు. సాయిసూర్య డెవలపర్‌ కేసు నేపథ్యంలో మహేష్‌బాబును విచారణకు హాజరు కావాలని ఈడీ నుంచి సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తనకు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా రేపు జరిగే విచారణకు హాజరుకాలేనని మహేష్‌బాబు లేఖలో తెలిపారు.

వీడియో షూటింగ్‌లు ముందస్తుగా నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని, ప్రస్తుతం వాటిని రద్దు చేయడం సాధ్యపడడం లేదని మహేష్‌బాబు ఈడీకి వివరించారు. అందుకే విచారణకు మరో రోజు సమయాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. మహేష్‌బాబు అభ్యర్థనపై ఈడీ స్పందించి తదుపరి విచారణ తేదీ ప్రకటించనుంది.

సాయిసూర్య డెవలపర్ కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఈడీ విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  US Elections 2024: అమెరికా ఎన్నికల్లో ఏనుగు-గాడిద.. అసలు కథ ఏమిటంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *