Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా ఎంతో భావోద్వేగమైన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది గౌతమ్ 19వ వసంతంలోకి అడుగుపెట్టారు. గౌతమ్ పుట్టినరోజున తాను పక్కన ఉండలేకపోవడంపై మహేశ్ బాబు విచారం వ్యక్తం చేశారు.
“నా కుమారుడా, నీకు 19 ఏళ్లు. ప్రతి సంవత్సరం నన్ను ఆశ్చర్యపరుస్తున్నావ్. కానీ ఈసారి నీ పుట్టినరోజును నేను మిస్ అవుతున్నాను. ఇలా మిస్ అవ్వడం ఇదే మొదటిసారి. నా ప్రేమ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా నేను నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను. ఎల్లప్పుడూ ఇలాగే ప్రకాశిస్తూ, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను” అని మహేశ్ తన పోస్ట్లో రాశారు. ఈ పోస్ట్ తో పాటు గౌతమ్ చిన్నప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.
Also Read: Rachita Ram: రచిత రామ్ హవా: లోకితో మరో భారీ ఛాన్స్!
మహేశ్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#SSMB29’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అందువల్లే ఆయన గౌతమ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం నైరోబి, టాంజానియాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
మహేశ్ బాబు పెట్టిన ఈ పోస్ట్ చూసి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు గౌతమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గౌతమ్ తల్లి, మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా తమ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్డే మా బంగారు కొడుకు. మా ప్రేమ ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది” అంటూ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ ప్రేమపూర్వక శుభాకాంక్షలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025

