Maganti Sunitha: జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలింగ్ కేంద్రాల్లో ‘రిగ్గింగ్’ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఆమె మాట్లాడుతూ… కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రౌడీషీటర్లు తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారని, డబ్బు ఆశ చూపించి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జూబ్లీహిల్స్లో ఎందుకు తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ రౌడీషీటర్లు, ఇతర నాయకుల జోక్యం కారణంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడిందని మాగంటి సునీత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు, పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రంగంలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఉపఎన్నికలో దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి పోలింగ్ను పర్యవేక్షిస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. మొత్తం 150 డ్రోన్ కెమెరాల సహాయంతో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత, పోలింగ్ విధానం ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినా, డ్రోన్ పర్యవేక్షణ కారణంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం శాంతియుతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
