Miyapur

Miyapur: ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి

Miyapur: సోమవారం సాయంత్రం కూకట్‌పల్లి నుంచి వేగంగా వస్తున్న లారీ మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ గొడుగును ఢీకొన్న ప్రమాదంలో ఒక హోంగార్డు మృతి చెందగా, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో ట్రాఫిక్‌ను నియంత్రించే విధుల్లో ఉన్న హోంగార్డు సింహాచలం, కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, అయితే చికిత్స పొందుతూ సింహాచలం మరణించాడు. ఇద్దరు కానిస్టేబుళ్ల పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Minister Lokesh: గత ఐదేళ్లు చీకటి పాలన: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *