NTR-Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం కోసం లొకేషన్ల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఇంటర్నేషనల్ స్థాయి సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షేర్ చేసిన విజువల్స్ ఆసక్తిని మరింత పెంచాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Vishwambhara: విశ్వంభర విడుదలయ్యేది ఎప్పుడంటే?
దేవర సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తదుపరి చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాను మేకర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం లొకేషన్ల రెక్కీలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ జోర్దాన్ అమన్ ప్రాంతం విజువల్స్ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, లొకేషన్ల ఫైనలైజేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. దేవరలా ఈ చిత్రం కూడా కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయి విజువల్స్తో ఈ సినిమా అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది.
#NTRNeel Dop Bhuvan Gowda sir’s Instagram story- Jordan 🔥🔥🔥🔥🐉🐉🐉🐉 pic.twitter.com/C9Cy00wVHO
— sayanendra ᵀᴵᴳᴱᴿᴺᴬᵀᴵᴼᴺ🤵 (@Sayanendra9999) December 30, 2025
