Kurnool: కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. కైతాళంలో ఉన్న కేసీ కెనాల్లోకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మృతులుగా కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన సునీల్ (22), మణికంఠ (23)లను గుర్తించారు. వీరు శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.