Ktr: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

Ktr: తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) లీగల్ నోటీసులు జారీ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అవैధంగా ట్యాప్ చేశారని మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. గతంలో జరిగిన సిట్ దర్యాప్తులో సుమారు 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని నిలదీయాలని కోరుతూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినట్టు సమాచారం. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ఉత్కంఠను రేకెత్తించనుంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajinikanth: సైమన్ ను ఆకాశానికెత్తేసిన దేవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *