Krishnaveni: సినీ పరిశ్రమకు ఎంతోమందిని పరిచయం చేసిన ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి (102) ఆదివారం ఉదయం ఫిల్మ్నగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆమె సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీలా వంటి ప్రముఖులను తెలుగు తెరకు పరిచయం చేసిన కృష్ణవేణి, ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా కూడా పనిచేసిన అటు నటిగా కూడా కనిపించారు.
Also Read: Maha Kumbh 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగో సారి ఇలా..
కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లో జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడిగా పనిచేస్తున్నారు. 1936లో సతీ అనసూయ సినిమాతో బాలనటిగా సినిమారంగంలో అడుగు పెట్టారు. సినీ అవకాశాల కోసం కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్తో ఆమె వివాహం జరిగింది. భర్త శోభనాచల స్టూడియోస్ పర్యవేక్షణలో పలు సినిమాలను ప్రొడ్యూసర్గా ఆమె నిర్మించారు. దక్షయజ్ఞం, జీవన జ్యోతి, భీష్మ, గొల్లభామ, ఆహుతి వంటి చిత్రాల్లో ఆమె నటించి, తెలుగు సినిమా రంగంలో తన గమ్యాన్ని ప్రేరేపించారు.