Konda surekha: భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్..

Konda surekha: రాష్ట్రంలోని దేవాదాయ శాఖ భూములపై అక్రమాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ భూముల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై, మంత్రి కొండా సురేఖ గురువారం చెంగిచెర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్శనలో ఆమెతో పాటు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ — చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 33/8 (10.35 ఎకరాలు), 33/9 (13 ఎకరాలు), 33/10 (6.23 ఎకరాలు) కలిపి మొత్తం 29.58 ఎకరాల భూమిని 1968లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్‌కు తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి ఇతరుల పేరిట రిజిస్టర్ చేశారని తెలిపారు. అయితే 1976లో సీలింగ్ చట్టం ప్రకారం ఈ భూములు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల రక్షణే తాము కట్టుబడి ఉన్నదని, అవసరమైతే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. ప్రజలు దేవాదాయ భూములపై కన్నేశారంటే కఠినంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *