Kishan reddy: ఇంట్లోకి చొరబడి కొడతాం.. మాస్ వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి

Kishan reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, భారత్‌పై పాకిస్తాన్ మళ్లీ దాడికి పాల్పడే యత్నం చేస్తే, దానికి వంద రెట్లు గట్టిగా ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు. “ఇంట్లోకి చొరబడి కొడతాం… వంకర బుద్ధి చూపితే పాక్ తోక కత్తిరించి తీరుతాం” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అన్నారు. “మనమేం మొదటగా ఎవరి జోలికి పోము. కానీ మమ్మల్ని గడ్డిని తాకినా క్షమించం. ఇకపై పరిణామాలు తీవ్రమైనవే ఉంటాయి” అని హెచ్చరించారు.

ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. “సిందూరం గన్‌పౌడర్‌గా మారితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రపంచం చూశింది. నా రక్తనాళాల్లో ప్రవహించేది రక్తం కాదు… సిందూరమే” అని ప్రధాని భావోద్వేగంగా చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కేవలం 22 నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఆ చర్య ద్వారా “మన మహిళల సిందూరాన్ని చెరిపేయాలనుకున్న శత్రువులను నేలమట్టం చేశాం” అని చెప్పారు. భద్రతా బలగాల ప్రదర్శనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇకపై పాకిస్తాన్ తలపడితే, దానికి భారీ మూల్యం చెల్లించాల్సిందే అని కిందటికిందే చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *