Pinarayi Vijayan

Pinarayi Vijayan: తీవ్ర పేదరిక నిర్మూలనలో దేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ

Pinarayi Vijayan: కేరళ రాష్ట్రం దేశ చరిత్రలో ఒక కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు అధికారికంగా ప్రకటించిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రకటించారు. 2021లో కేరళ ప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన అనే ఒక ప్రతిష్టాత్మక మిషన్‌ను ప్రారంభించింది. ఈ లక్ష్యం కింద, రాష్ట్రంలో గుర్తించిన ప్రతి పేద కుటుంబాన్ని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికను అమలు చేసింది. 2021 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 64,000 తీవ్ర పేద కుటుంబాలను గుర్తించారు.

ఈ కుటుంబాలకు గృహాలు, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, ఆహార భద్రత, సామాజిక భద్రతను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఈ మిషన్లో కుటుంబశ్రీ మిషన్ కీలక పాత్ర పోషించింది. పేదరిక నిర్మూలన విజయవంతమైన తరువాత, ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ద్వారా కేరళలో ఇకపై ఎవరూ తీవ్ర పేదరికంలో లేరని ధృవీకరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, “కేరళ ఈ గొప్ప విజయాన్ని సాధించడం పట్ల గర్వంగా ఉంది.

మన సామాజిక న్యాయం, సమానత్వం పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు” అని పేర్కొన్నారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే ఈ ఘనత సాధ్యమైందని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *