KERALA: కేరళ కూతురుపై విచారణకు అనుమతి

KERALA: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టి.వీణ పై, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (KMRL) అక్రమ లావాదేవీల్లో ఆమె పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో, కేంద్రం ఆమెను విచారించేందుకు అనుమతిని ఇచ్చింది.

KMRL కంపెనీపై అక్రమ లావాదేవీలు జరిగాయి అని ఆరోపణలు రావడంతో, కంపెనీల చట్టం ఉల్లంఘన కింద టి.వీణపై కేసు నమోదయింది. ఈ క్రమంలో, కొచ్చిన్ లోని ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఈడీ మనీ లాండరింగ్ కేసు:

ఈ కేసులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు ద్వారా, టి.వీణపై ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. గతంలో బంగారం స్మగ్లింగ్ కేసులో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *