Karnataka

Karnataka: దర్జా దొంగ.. 180 కేసులు.. ప్రియురాలి కోసం 3 కోట్ల రూపాయల బంగ్లా!

Karnataka: చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడిన ఒక దొంగ పెద్దయ్యేసరికి దర్జాదొంగగా మారిపోయాడు. ఒకటీ రెండూ కాదు పోలీసులు అతని మీద నమోదు చేసిన దొంగతనం కేసులు ఏకంగా 180. అనుకోకుండా బెంగళూరులో ఓ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ దర్జా దొంగ తన కోల్‌కతా స్నేహితురాలి కోసం రూ.3 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కొని ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ని కూడా విచారించడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దర్జా దొంగ స్టోరీ ఇంటిలో బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద మీడియాకు వివరించారు. 

Karnataka: మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచక్ శారీ స్వామి (37) అనే వ్యక్తిని మడివాలా పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి  వివిధ దొంగతనాల కేసుల్లో ప్రమేయం ఉంది.  అతని నుంచి 181 గ్రాముల బంగారు కడ్డీలు, 333 గ్రాముల వెండి వస్తువులు, బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే వైర్, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పంచక్ శారీ స్వామి తండ్రి రైల్వేలో పనిచేసేవారు. అతను చనిపోయిన తర్వాత, అతని భార్యకు ఉద్యోగం వచ్చింది. పంచక్ శారీ సామికి పెళ్లి అయింది. అతనికి ఒక బిడ్డ ఉంది. 

Karnataka: పంజాబ్ శారీ స్వామి తల్లి, భార్య, బిడ్డ షోలాపూర్‌లోని 400 చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంటిపై అప్పు తీసుకున్నారు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి నోటీసు పంపారు. ఆ ఇల్లు ఇప్పుడు వేలానికి వచ్చింది.
2003లో, ఇంకా మైనర్‌గా ఉన్నప్పుడే, పంజక్ షరీ సామి దొంగతనం చేయడం ప్రారంభించాడు. 2009 నుండి అతను ప్రొఫెషనల్ దొంగగా మారాడు. వివిధ ఇళ్ల నుండి దొంగిలించిన నగలు,  వెండి వస్తువులను అమ్మడం ద్వారా సంపాదించిన డబ్బుతో అతను విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఈ క్రమంలో అతనికి మహారాష్ట్రకు చెందిన ఒక నటితో పరిచయం ఏర్పడింది.
ఆ నటి కోసం అతను కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. 2016లో, అతను  కోల్‌కతాకు చెందిన ఆ నటిని కలిసాడు. తరువాత, అది ప్రేమగా మారింది. తన ప్రేయసి కోసం కోల్‌కతాలో 3 కోట్ల రూపాయలకు విలాసవంతమైన బంగ్లాను నిర్మించాడు. తన ప్రియురాలి పుట్టినరోజుకు 22 లక్షల రూపాయల బహుమతిని కూడా కొన్నాడు.
2016లో, అతన్ని దొంగతనం కేసులో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి సబర్మతి జైలులో ఉంచారు. అతను ఆరు సంవత్సరాలు జైలులో గడిపాడు, 2022లో విడుదలయ్యాడు.  మళ్ళీ దొంగతనం చేయడం ప్రారంభించాడు.

Karnataka: మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ దర్జా దొంగ తన ప్రతిభను ప్రదర్శించాడు. నాలుగు రాష్ట్రాలలో అతనిపై 180 కేసులు ఉన్నాయి. దొంగిలించిన బంగారు నగలను కరిగించి అమ్మేశాడు. ఆటను ఒక ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి బయటకు వచ్చిన తర్వాత, బట్టలు మార్చుకుని పారిపోతాడు. నిఘా కెమెరా నుండి తప్పించుకోవడానికి ఈ దొంగ అలా చేస్తాడట. అంతేకాదు మనోడు  కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. ప్రస్తుతం అతని స్నేహితురాలిని కూడా విచారించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. మిగిలిన నగలను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *