Cylinder Explosion: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మనలూర్పేట్టె ప్రాంతంలో తెన్పెన్నయ్యారు నది ఉత్సవం ఎంతో ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, ఒక్కసారిగా జరిగిన పేలుడుతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. బెలూన్లలో గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న హీలియం సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది.
ఈ భీకర పేలుడు ధాటికి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. ఈ ఘటనలో మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవం కావడంతో అక్కడ భక్తులు, సందర్శకులు భారీ సంఖ్యలో ఉన్నారు. బెలూన్లు అమ్ముతున్న వ్యక్తి వాహనంపై సిలిండర్ను ఉంచి గాలి నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష
విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సిలిండర్ పేలడానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఉత్సవ ప్రాంతం, ఈ ప్రమాదంతో ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది.
#WATCH | Tamil Nadu | One dead and at least 18 injured after a helium cylinder exploded during the Thenpennai River Festival in Manalurpettai in the Kallakurichi district: District Collector of Tiruvannamalai, K. Tharpagaraj
(Visuals from the spot) pic.twitter.com/fVufIa2cSc
— ANI (@ANI) January 19, 2026
