Jyothi Surekha

Jyothi Surekha: సురేఖకు స్వర్ణం

Jyothi Surekha: ప్రపంచ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌ టోర్నీలో  ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణంతో మెరిసింది. కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఈ విజయవాడ ఆర్చర్‌ 147-145 తేడాతో  బెల్జియం ఆర్చర్ మరీటాపై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్ లోనూ గట్టి పోటీ ఎదుర్కొన్న వెన్నం జ్యోతి.. షూటాఫ్ లో విజయంతో ఫైనల్ చేరింది. టఫ్ గా సాగిన సెమీస్ మ్యాచ్ లో జ్యోతి ఎక్కడా తలడపలేదు. ఇటలీ ఆర్చర్ ఎలీసా ఎంతగా పోటీనిచ్చినా..గురి తప్పలేదు. పోటాపోటీగా స్కోర్లు సాధించడంతో సెమీస్ మ్యాచ్ షూటాఫ్ అవసరమైంది. షూటాఫ్ లో విజయంతో ఫైనల్లో చేరిన జ్యోతి ..ఫైనల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. పట్టువదలకుండా ..గురి తప్పకుండా సర్ణ ప్రదర్శనతో అదరగొట్టింది.

ఇది కూడా చదవండి: AUS vs IND: పెర్త్ టెస్టుకు బుమ్రా సారథ్యం..వన్ డౌన్ లో రాహుల్..

IND vs JPN: అజేయంగా భారత్‌

IND vs JPN: మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ జోరు కొనసాగిస్తోంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్ లో  3-0 గోల్స్ తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. లీగ్‌ దశను అజేయంగా ముగించింది.భారత్‌ తరఫున దీపిక47వ, 48వ నిమిషంలో  రెండు గోల్స్‌ కొట్టగా.. 37 వ నిమిషంలో నవ్‌నీత్‌ గోల్ సాధించింది. ఈ మ్యాచ్ లో  భారత డిఫెండర్లు జపాన్ స్ట్రైకర్లను అద్భుతంగా నియంత్రించారు. టోర్నీలో భారత్  అయిదు మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో చైనా  రెండో స్థానంతో నిలిచింది. కాగా,  భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌ను ఢీకొంటుంది. మరో సెమీస్‌లో చైనా, మలేసియా తలపడతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *