Jupally Krishna Rao: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో, తాను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదని ఆయన అన్నారు. ఇందిరమ్మ నమూనా గృహాల ప్రారంభోత్సవం సందర్భంగా జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
“నేను హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. అందుకే నేను హామీలు ఇవ్వను” అని జూపల్లి అన్నారు. అయితే, తన వంతుగా ప్రజలకు పనులు చేయడానికి మాత్రం ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వకుండా, ప్రజలకు అవసరమైన పనులు చేస్తానని స్పష్టం చేశారు.

