Jogi Ramesh

Jogi Ramesh: ఆటో డ్రైవర్ల ‘సేవ పథకం’పై జోగి రమేష్ ఫైర్

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంపై ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వం అమలు చేసిన ‘వాహన మిత్ర’ పథకాన్ని అడ్డంగా కాపీ కొట్టిందేనని ఆయన ఆరోపించారు. ఈ కొత్త పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఎలాంటి మేలు జరగదని, ఇది కేవలం ‘చావుబతుకుల్లో ఉన్నవారికి తులసి నీళ్లు పోసినట్టుంది’ అని ఘాటు వ్యాఖ్యానించారు.

కాపీ కొట్టారు, కడుపు కొట్టారు
జోగి రమేష్ మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ఐదేళ్లుగా ఆటో డ్రైవర్లకు ‘వాహన మిత్ర’ పథకం ద్వారా ప్రతి ఏటా ₹15,000 సాయం అందించిందని, ఈ పథకాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పేరుతో కాపీ కొట్టిందని అన్నారు.

“ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) కారణంగా నష్టం జరిగింది. ఈ పథకంతో దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టినట్టు అయింది,” అని ఆయన అన్నారు.

“ఉచిత బస్సు పథకం వల్ల దాదాపు 50 వేల మంది ఉద్యోగులు ఉన్న ఆర్టీసీని కూడా దెబ్బతీశారు,” అని రమేష్ విమర్శించారు.

కేసుల పేరుతో వేధింపులు లేవు
గత వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లను ఏ విధంగానూ వేధించలేదని, వారిపై అన్యాయంగా కేసులు పెట్టలేదని జోగి రమేష్ గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఆటో డ్రైవర్ల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పథకం పేరు మార్చి, దానిని గొప్పగా చెప్పుకోవడం కన్నా, వారికి జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ముఖ్యమని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *