YS Jagan

YS Jagan: తెలంగాణ హైకోర్టులో జగన్‌కు దక్కని ఊరట

YS Jagan: తెలంగాణ హైకోర్టు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ ద్వారా సంస్థపై ఉన్న సీబీఐ కేసులను రద్దు చేయాలని కోరారు.

వాన్‌పిక్ ప్రాజెక్ట్‌ (VANPIC) అనేది వాడరేవు – నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రారంభమైన పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 13,000 ఎకరాలకు పైగా భూములను సమకూర్చారు. అయితే, ఈ భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, క్విడ్ ప్రో కో పద్ధతిలో జగన్‌కు లాభాలు కల్పించారని సీబీఐ ఆరోపించింది.

ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కీలక నిందితుడిగా నిలిచారు. తనపై, కంపెనీపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు దీనిని సమగ్రంగా పరిశీలించి, ప్రాథమికంగా సీబీఐ ఆరోపణల్లో ఆధారం ఉందని అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay: ఓటు చోరీ చేసినట్లైతే మేమే అధికారంలోకి వస్తాం కదా?

జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పులో, ఈ దశలో కేసును కొట్టివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కోర్టు, “ఇది మినీ ట్రయల్ కాదు, విచారణ కొనసాగాల్సిన అవసరం ఉంది” అని పేర్కొంది. అయితే, నిమ్మగడ్డ ప్రసాద్‌కు ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది అని కోర్టు సూచించింది.

ఈ తీర్పుతో వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇది మరో కీలక మలుపుగా మారింది. సీబీఐ వాదనలకు బలం చేకూర్చిన ఈ తీర్పు, విచారణను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Facilitation To TTD Chairman: మీడియా తరుపున టీటీడీ చైర్మన్ కు ఘనంగా ఆత్మీయ సత్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *