Jagadeesh reddy: దోచుకోవడం దాచుకోవడమే అజెండాగా పనిచేస్తుండ్రు..

Jagadeesh reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని నాశనం చేసిందని, మంత్రుల లక్ష్యం దోచుకోవడం, దాచుకోవడమేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే, మంత్రుల ఆదాయం మాత్రం పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు

“రాష్ట్రానికి సేవ చేయాల్సిన మంత్రులు హెలికాప్టర్లలో శిఖారాలు చేస్తూ తిరుగుతున్నారు. కానీ, ఎండిపోయిన పంటల్ని పరిశీలించడానికి వారికెప్పుడు సమయం దొరకడం లేదు,” అంటూ రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

రైతుల పరిస్థితి దయనీయమైంది

కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారని జగదీష్‌రెడ్డి తెలిపారు. “ఎండిపోయిన పంటలను చూసి రైతులు ఉసురుపోస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వారి కష్టాలను పట్టించుకునే పరిస్థితిలో లేదు,” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శాపం

“కేవలం ఏడాది పాలనలోనే తెలంగాణను పూర్తిగా నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రజలు మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి రానివ్వరు,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించగా, కాంగ్రెస్ నేతల నుంచి దీన్ని ఎలా ప్రతిస్పందిస్తారోచూడాల్సి ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *