Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. థియేటర్లు ఊహించని విధంగా మూతపడడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. మొదట, సినిమా విడుదలలో అడ్డంకులు లేవని చెప్పినప్పటికీ, ఫిల్మ్ ఛాంబర్ సమావేశం సానుకూలంగా ముగియకపోవడం కొత్త ట్విస్ట్గా నిలిచింది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ తో మున్నాభాయ్.. పెద్ది సెట్స్ లో జోరు!
Harihara Veeramallu: ఈ గందరగోళం వెనుక నలుగురు నిర్మాతల కుట్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు. అసలు కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో సినిమా విడుదలపై సస్పెన్స్ మరింత రసవత్తరంగా మారింది. ఇంతకీ ఈ డ్రామాకు ముగింపు ఎలా ఉంటుంది? అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
23-05-2025
అమరావతిజూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.…
— JanaSena Party (@JanaSenaParty) May 23, 2025
