Iran: జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, మసౌద్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మసౌద్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదం మానవాళిపై పెద్ద ప్రమాదమని పేర్కొంటూ, ఇలాంటి శక్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, ఇటీవలి రోజులలో ఇరాన్లోని ఓ పోర్టులో జరిగిన ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరస్పర సానుభూతి సందేశాలు భారత్-ఇరాన్ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.