India vs Bangladesh

విజయానికి చేరువలో భారత్.. భారీ లక్ష్యం ముంగిట బంగ్లా తడబాటు!

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 6 వికెట్ల దూరంలో ఉంది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

ప్రస్తుతం 515 పరుగుల లక్ష్యంతో ఆ జట్టు 357 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో 51, షకీబ్ అల్ హసన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశాడు.

మూడో రోజు వెలుతురు కారణంగా 10 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో, మొదట ఆట చాలా సేపు నిలిపివేసి వేచి చూశారు. కానీ, తరువాత కూడా లైట్ సరిగా లేకపోవడంతో మూడోరోజు ఆటను ముందుగానే ముగించేశారు. 

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్), రిషబ్ పంత్ (109) సెంచరీలతో రాణించారు. గిల్ టెస్టు కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ కాగా, పంత్ కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149 పరుగులకు కుప్పకూలింది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ .. రెండో స్థానానికి రోహిత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *