India-Canada: కెనడాకు చెందిన గూఢచారి సంస్థ కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ బెదిరింపు దేశాల జాబితాలో భారత్ను తొలిసారిగా చేర్చింది. ఇందులో 2025-26లో ముప్పు పొంచి ఉన్న దేశాల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వం ఆధునిక సైబర్ ప్రోగ్రామ్ను సిద్ధం చేస్తోందని, దీని వల్ల కెనడాకు ముప్పు వాటిల్లుతుందని CSE నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి:
India-Canada: ఖలిస్తానీలపై చర్యల వెనుక హోం మంత్రి అమిత్ షా ఉన్నారని కెనడా చేసిన ప్రకటనపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కెనడా హైకమిషన్ అధికారిని పిలిపించారు. షాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని ఆయనకు చెప్పారు. ఇది భారతదేశ పరువు తీసే వ్యూహం. ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.