Olympic Games

Olympic Games: ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న భారత్..! ఎప్పుడంటే…

Olympic Games: 2036 ఒలింపిక్స్‌ను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో మోదీ ప్రసంగిస్తూ, ఒలింపిక్స్‌ను నిర్వహించడం వల్ల క్రీడా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా నిర్మాణం, రవాణా, పర్యాటక రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుందని అన్నారు.

ఎన్నో ప్రపంచ దేశాలతో పోలిస్తే క్రీడలలో ఎంతో వెనుకబడి ఉన్న భారత్… ఇకనుండి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ క్రీడా ప్రాంగణంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు జరుపుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మోదీ వెల్లడించడం గమనార్హం. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది అని… జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ మోదీ అన్నారు. ఒలింపిక్స్ అంటే క్రీడలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా, అనేక ఇతర రంగాలు కూడా లబ్ధిపొందుతాయి. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాలు… ఎంతో మందికి ఉపాధి అవకాశాలను తెస్తాయి. క్రీడా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఒలింపిక్స్‌ను నిర్వహించే నగరం కొత్త కనెక్టివిటీని పొందింది సరికొత్త మౌలిక సదుపాయాలు నిర్మించబడుతాయి అని ప్రధాని అన్నారు.

ఇది కూడా చదవండి: Fact Check: భారత క్రికెటర్ రింకూ సింగ్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఒకే హోటల్ లో ఉన్నారా? ఎఐ చేసిన రచ్చ చూడండి..!

Olympic Games: దీని వల్ల నిర్మాణ రంగానికి, రవాణా రంగానికి, మరీ ముఖ్యంగా పర్యాటక రంగానికి మేలు జరుగుతుంది. క్రీడల్లో పాల్గొనడానికి మరియు చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. ఇది మొత్తం దేశానికి మేలు చేస్తుంది. జాతీయ క్రీడలను నిర్వహించడం ఉత్తరాఖండ్‌కు అదే విధంగా సహాయపడుతుందని మోడీ అన్నారు. క్రీడలను చూసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రజలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. క్రీడలు ఇతర రంగాలకు కూడా దోహదపడతాయి మరియు ఆర్థిక వృద్ధికి సహాయపడతాయి” అని ఆయన అన్నారు.

ఇక ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది మరియు IOA అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ యొక్క ఫ్యూచర్ హోస్ట్స్ కమిటీతో చర్చలు కూడా జరుపుతోంది. అథ్లెట్లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అంతర్జాతీయ పోటీల్లో పతకాల పట్టికలో ప్రతిబింబిస్తోందని మోదీ ఆశాభావం కూడా వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *