Manas Sarovar Yatra: బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన జి-20 సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించడం, భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం వంటి అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. కైలాష్ మానస సరోవరం యాత్ర గత ఐదేళ్లుగా మూతపడింది. అటువంటి పరిస్థితిలో, ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య ఈ చర్చల తరువాత, భారతదేశ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇద్దరు నేతలు.
ఇది కూడా చదవండి: National News: అక్షరాస్యతలో దేశంలో టాప్-10 రాష్ట్రాలు ఇవే..
సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్ ద్వారా కైలాష్ మానససరోవర్ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం జూన్ నెలలో ప్రారంభమవుతుంది. అయితే దీని కోసం ఏర్పాట్లు జనవరి నుండి ప్రారంభమవుతాయి. కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది హిందూ మతానికి చాలా ముఖ్యమైన పవిత్ర యాత్ర. ఈ ప్రయాణం టిబెట్లోని కైలాస పర్వతం, మానససరోవర్ సరస్సు దర్సించుకునే అవకాశం దొరుకుతుంది. రెండూ హిందువులకు పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు. కైలాస పర్వతం శివుని నివాసంగా చెబుతారు. అలాగే, మానససరోవర్ సరస్సు ను బ్రహ్మ దేవుడు సృష్టించినట్లు భావిస్తారు. ఈ సరస్సు టిబెట్ ఎత్తైన పీఠభూమిలో ఉంది. దీని ఎత్తు దాదాపు 4,590 మీటర్లు.
On the sidelines of the G20 Summit in Rio, met CPC Politburo member and FM Wang Yi of China.
We noted the progress in the recent disengagement in the India-China border areas. And exchanged views on the next steps in our bilateral ties.
Also discussed the global situation. pic.twitter.com/fZDwHlkDQt
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2024