Heavy Rain Alert

Heavy Rain Alert: హైదరాబాద్ నగరం ఆగమాగం.. మరో 3 రోజులు వానలే వానలు! ఎల్లో అలెర్ట్ జారీ

Heavy Rain Alert: గత కొద్ది రోజులుగా తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఉదయాన్నే ఎండలు మండిస్తుండగా, సాయంత్రం నుంచి రాత్రివరకు వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. మూడు గంటల పాటు నిరంతరంగా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

హైదరాబాద్‌ నగరంలో బండ్లగూడలో 87.3 మిల్లీమీటర్లు, ఆస్మాన్‌ఘర్‌లో 82.5 మిల్లీమీటర్లు, మలక్‌పేటలో 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాలైన సరూర్‌నగర్, మూసారాంబాగ్, ఎల్బీనగర్‌లలో కూడా 70 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. పలు రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయిన ఘటనలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంట్ల్లోకి నీరు ప్రవహించడంతో ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

పిడుగుపాటుకు నాలుగు మృతి, మేకలు, గొర్రెలు కూడా మృతి

వర్షాలు కేవలం నాన్చిన వానతో ఆగలేదు. పిడుగుపాటులతో రాష్ట్రవ్యాప్తంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాలో ఒకరు మృతి చెందారు. పశువుల మృతిచే రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

వేగంగా బలపడుతున్న అల్పపీడనం – వర్షాలు ఇంకా కొనసాగే సూచనలు

బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తి తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడనం అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే సూచనలున్నాయి.

ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ రోజు తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండ, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ధూళి తుఫాన్ బీభత్సం.. 450కి పైగా విమానాలు ఆలస్యం

ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు

వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మామూలు కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాడు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మహబూబ్‌నగర్‌లో కనిష్ఠంగా 29.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వర్షాలు, వరదలు – అత్యవసర బృందాలు సిద్ధంగా

GHMC, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో హైడ్రా బృందాలు, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పాత జిల్లా కేంద్రాల్లో అగ్నిమాపక బృందాలు వరద నివారణకు సిద్ధంగా ఉన్నాయి. 12 పోలీస్ బెటాలియన్లలోని 100 మంది సిబ్బందితో ప్రత్యేక విపత్తు బృందాలను ఏర్పాటు చేశారు.

ALSO READ  pakistan: చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ

జాగ్రత్తగా ఉండండి – అవసరమైతే 100 లేదా 108కు కాల్ చేయండి. వర్షాలు తగ్గే వరకు బయటకు వెళ్ళడం నివారించండి. మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *