illegal drugs:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్కు డ్రగ్స్ను చేరవేస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏపీకే చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల దాడిలో దొరికిన ఆ ముఠాలో ఆరుగురు సభ్యులు ఉన్నారు.
illegal drugs:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ (40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర (31), బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్ (34), షేక్ మస్తాన్ వలీ (40), దేవరాజు యేసుబాబు (29) కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారు.
illegal drugs:కానిస్టేబుల్ గుణశేఖర్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా, సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ ఆరుగురు ముఠా గుట్టు బయటపడింది. పట్టుబడిన ఆ కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్వోటీ పోలీస్ అధికారులు వెల్లడించారు.