Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Hyderabad: ఆరోగ్యం కోసం చేసే ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని నాగోల్ షటిల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనలో మృతిచెందిన యువకుడిని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్‌గా గుర్తించారు. రాకేష్‌ తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు.

Also Read: Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కారుపై ఎంపీ స్టిక్కర్… డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్

రాకేష్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూమ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి ప్రతిరోజూ షటిల్ ఆడే అలవాటు ఉంది. ఆదివారం రాత్రి అలవాటు ప్రకారం, నాగోల్ స్టేడియంలో స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతున్నాడు. ఆట మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్నేహితులు వెంటనే అతని వద్దకు పరుగెత్తి లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను స్పృహ కోల్పోవడంతో, వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. చేతికి వచ్చిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాకేష్ స్వగ్రామమైన తల్లాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *